కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో వర్షాలకు నేలకొరిగిన మర్రిచెట్టుకు ప్రకృతి ప్రేమికుడు ప్రకాశ్ జీవంపోశారు. మంగళవారం ఆ చెట్టును క్రేన్ల సాయంతో సిరిసిల్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ సహకారంతో మర్రిని సిరిసిల్ల కలెక్టరేట్ భవనం వద్ద నాటనున్నట్టు ప్రకాశ్ తెలిపారు.