ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునగగా, శుక్రవారం పరామర్శ కోసం వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కారు నుంచి కాలు కిందపెట్టలేదు. ఎన్టీఆర్ నగర్ కాలనీకి వచ్చిన ఆమె కారు దిగకుండానే బాధితులతో మాట్లాడుతూ ముందుకు కదిలారు. కారులో నుంచే పరామర్శిస్తారా? ఇలాంటి నాయకులు మాకేం న్యాయం చేస్తారంటూ వారు మండిపడ్డారు. ఆదుకుంటామంటూ పనికిరాని స్పీచ్లు ఇవ్వడం కాదు, ఆపదలో అండగా నిలబడే వారే నిజమైన నాయకులని స్థానికులు పేర్కొన్నారు. – మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్