కోరుట్ల రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని గుములాపూర్ శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ‘జలహితం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. 150 మంది కూలీలు వరుస క్రమంలో నిలబడి పూడిక మట్టిని ఒకరి నుంచి మరొకరు అందుకుంటూ కాలువ ఒడ్డున పోశారు.