ములుగు : పాలంపేట రామప్ప దేవాలయ ప్రాంగణంలో తెలంగాణ జాతీయ వజ్రోత్సవ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బొంపల్లి సుదీర్రావు శిష్యబృందం నృత్య ప్రదర్శన చూపరులను కట్టిపడేశాయి. ప్రముఖ మ్యూజిషియన్ డ్రమ్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, జలవనరుల సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.