హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ చర్యలపై 20న మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు.. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
సమావేశంలో జిల్లాల వారీగా కొవిడ్ నియంత్రణ చర్యలు, ప్రస్తుత పరిస్థితి, వ్యాక్సినేషన్పై మంత్రులు జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నారు. కొవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నివారణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2 కోట్ల టెస్టింగ్ కిట్లతో పాటు ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లను కూడా సిద్ధం చేశారు. ఏఎన్ఎం సబ్ సెంటర్లతో పాటు పీహెచ్సీ స్థాయిల్లో కరోనా సేవలు అందిస్తున్నారు.