పరిగి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్వర్రెడ్డికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీశ్రావు, జగదీశ్వర్రెడ్డి.. హరీశ్వర్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా హరీశ్వర్రెడ్డి కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిని మంత్రులు ఓదార్చారు. ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.