మహబూబ్నగర్ : తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత రెండురోజులుగా స్వల్ప అస్వస్థత ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైద్యుల సహాయ మేరకు హోం క్వారంటైన్లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకొని, జాగ్రత్తలు పాటించాలని మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి