మహబూబ్నగర్: ఆబ్కారీ, టూరిజం, క్రీడలు యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ( Errabelli Dayaker Rao ) పరామర్శించారు. గత నెల 29న రాత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ గుండె ఆగిపోవడంతో కన్నుమూశారు. ఇవాళ చిన్నకర్మ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ను పరామర్శించారు. ఎర్రబెల్లితోపాటు మంత్రి శ్రీనివాస్గౌడ్ను పరామర్శించిన వారిలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, దేవీప్రసాద్ రావు, దేశపతి శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు ఉన్నారు. శాంతమ్మ సమాధిపై మంత్రి ఎర్రబెల్లితోపాటు ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.