హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): అమరవీరుల స్మారకచిహ్నం పనులను గడువులోగా పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న స్మారకచిహ్నం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుదిదశ పనుల్లో వేగం పెంచి గడువులోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నామని, ఎక్కడా జాప్యంలేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం స్మారకచిహ్నం ముందు జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు ఆయన వెంట ఉన్నారు.