హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తన మనుమరాలు పుట్టినరోజు కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును ఆహ్వానించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆమె బీఆర్ఎస్ ముఖ్య నేతలను కలిసి ఆహ్వానించారు.
కేటీఆర్, హరీశ్రావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శంకరమ్మ కుటుంబ యోగక్షేమాలను మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు అడిగి తెలుసుకొన్నారు. పుట్టినరోజు కార్యక్రమానికి వస్తామని చెప్పారు.