ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 27: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతని తెలంగాణ మాల మహానాడు తెలిపింది. నియోజకవర్గంలోని మాల లు, మాల ఉపకులాల వారు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చింది. గురువా రం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడు తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియడారు.
అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు. సమావేశంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దమ్మ రాజశేఖర్, ఉపాధ్యక్షుడు దారా యోబు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలారి రాజు, నాయకులు కర్నె భాస్కర్, పీఎం దాస్ తదితరులు పాల్గొన్నారు.