హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. శనివారం 24,686 మందికి పరీక్షలు చేయగా.. 247 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 157, రంగారెడ్డిలో 60, మేడ్చల్ మల్కాజిగిరిలో 13 కేసులు వెలుగు చూశాయి.
మరోవైపు కొవిడ్ నుంచి కోలుకొంటున్నవారి సంఖ్య సైతం పెరుగుతున్నది. శనివారం 116 మంది రికవరీ అయ్యారు. రికవరీ రేటు 99.24 శాతంగా నమోదైంది.