హైదరాబాద్: శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో రోజైన నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం టేబుల్ ఐటమ్స్గా మంత్రులు వార్షిక నివేదికలను సభకు సమర్పించారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు సంబంధించిన 1వ, 2వ, 3వ వార్షిక నివేదికలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభకు అందజేశారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.