సైదాబాద్, జూన్ 6: తెలంగాణ జువైనల్ హోంలలో అమలుచేస్తున్న సంస్కరణలు, వసతులు, నిర్వహణ పద్ధతులు దేశంలో మరెక్కడా లేవని బీహార్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ సీహెచ్ ప్రశాంత్కుమార్, యునిసెఫ్ బీహార్ రాష్ట్ర సీనియర్ కన్సల్టెంట్ సునీల్కుమార్ ఝా ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కొనియాడారు. జువైనల్ హోమ్స్లో వసతులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు.
తెలంగాణలోని జువైనల్ హోం లలో అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయడానికి వచ్చిన బీహార్ అధికారులు మంగళవారం సైదాబాద్ జువైనల్ హోం డైరెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న బాలుర సదనం, ఆఫ్టర్ కేర్హోం, ప్రత్యేక సదనం, బాలికా సదనంతోపాటు తెలంగాణ జువైనల్ వెల్ఫేర్ ఆర్చరీ అకాడమీని సందర్శించారు. అక్కడే భోజనం చేసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యునిసెఫ్ కన్సల్టెంట్ ప్రతినిధులు రాకేశ్రెడ్డి, శృతి, జువైనల్ హోం డీడీ మిర్జా రజాక్ అలీబేగ్, గోపీకుమార్, బాలుర సదనాల పర్యవేక్షణాధికారులు నవీన్కుమార్, నాగమల్ల నాగేశ్వరరావు, అప్జల్ అహ్మద్ పాల్గొన్నారు.