హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): టీఎస్ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 48 అసిస్టెంట్ ఇంజినీర్/ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆదేశించారు. వచ్చే ఎండాకాలంలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరిగి 15,500 మెగావాట్లకు మించే అవకాశం ఉన్నదని తెలిపారు. డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్తు సంస్థ ల సీఎండీలు చర్యలు చేపట్టాలని సూచించా రు. మంగళవారం హైదరాబాద్లో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్లో, వచ్చే ఎండాకాలంలో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం ప్రణాళిక లు రచించాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏటా రికార్డు స్థాయిలో విద్యు త్తు డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు.