IT Minister Sridhar Babu | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదివారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ రోడ్షో నిర్వహించనున్నారు. ముందుగా ఆయన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులపై చర్చించనున్నారు.
రోడ్షోలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి మంత్రి వివరిస్తారు.