మిల్లుల్లో ధాన్యం బస్తాల లెక్కల్లో తేడా ఉన్నదని, మరికొన్ని మిల్లుల్లో లెక్కింపునకు అనుగుణంగా ధాన్యం బస్తాలు లేవనే సాకుతో ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మిల్లుల నుంచి సీఎమ్మార్ తీసుకోవడాన్ని ఎఫ్సీఐ నిలిపివేసింది.
ఎఫ్సీఐ తనిఖీల్లో మెదక్ జిల్లాలోని ఒక రైస్ మిల్లులో తక్కువొచ్చిన బస్తాల సంఖ్య కేవలం రెండు. ఈ కారణంతో ఈ మిల్లు నుంచి కూడా సీఎమ్మార్ తీసుకోవడాన్ని ఎఫ్సీఐ నిలిపేసింది. మారుమూల జిల్లాలోని ఒక రైస్ మిల్లులో ధాన్యం తనిఖీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,500 మిల్లులో మిల్లింగ్ను పూర్తిగా నిలివేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని మిల్లుల్లో సుమారుగా 92 లక్షల టన్నుల ధాన్యం, 23 కోట్ల ధాన్యం సంచులు ఉన్నాయి. ఎఫ్సీఐ తనిఖీల్లో లెక్కతేలని బస్తాల సంఖ్య కేవలం 1.19 లక్షలు. అంటే మొత్తం సంచుల్లో 0.5% మాత్రమే. ఇంత మాత్రం దానికే మిల్లుల్లో ధాన్యం మాయమైందంటూ గగ్గోలు పెట్టడంతోపాటు ఈ మిల్లుల నుంచి సీఎమ్మార్ను నిలుపుదల చేసింది.
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణపై కేంద్రం పగబట్టింది. కేంద్రం విధానాల్లో డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్న సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డదారుల్లో ఇబ్బంది పెడుతున్నది. పరిమితులకు లోబడి అర్హత ఉన్నప్పటికీ రాష్ట్రం రుణ సమీకరణ చేయకుండా ఇటీవల రెండు నెలలపాటు అడ్డుకొన్నది.
ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడం, ఆర్థికంగా భారం మోపటమే లక్ష్యంగా ఇప్పుడు ఎఫ్సీఐని ప్రయోగిస్తున్నది. కుట్రలో భాగంగా ఇప్పటికే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్సీఐ చెప్పటంతో, రాష్ట్రమే సుమారు 3 వేల కోట్ల నష్టాన్ని భరించి రా రైస్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రైతులకు అండగా నిలువటంతో రాష్ర్టాన్ని ఎలాగైనా ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశంతో ఎఫ్సీఐ ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. చిన్న చిన్న కారణాలతో సీఎమ్మార్ బియ్యం తీసుకొనేందుకు నిరాకరిస్తూ ఇబ్బంది పెడుతున్నది. రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీని మూసివేసి, వరి రైతుల నోట్లో మట్టికొట్టే కుట్ర చేస్తున్నది. కుంటిసాకులతో రాష్ట్రంలో వారంరోజులుగా సీఎమ్మార్(బియ్యం)ను తీసుకొనే ప్రక్రియను ఎఫ్సీఐ నిలిపివేసింది.
సీఎమ్మార్ ఇవ్వకపోతే చర్చలు తీసుకోవచ్చు: మిల్లర్లు
మిల్లుల్లో గత యాసంగి, వానకాలం, ప్రస్తుత ధాన్యం కలిపితే సుమారు 92 లక్షల టన్నుల ధాన్యం ఉంది. అంటే 23 కోట్ల ధాన్యం బస్తాలు మిల్లుల్లో ఉన్నాయి. ఎఫ్సీఐ తనిఖీల్లో 1,19,251 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్టు తెలిపింది. అంటే మొత్తం బస్తాల్లో ఇది కేవలం 0.5 శాతమే. ఈ మాత్రానికే మిల్లుల్లో ధాన్యం మాయమైందంటూ ప్రచారం చేసిన ఎఫ్సీఐ, ఈ సాకుతో సీఎమ్మార్ తీసుకోవడాన్ని కూడా నిలిపేసింది. ఒక్కో మిల్లుల్లో రెండు, మూడు, నాలుగు బస్తాలు తక్కువగా ఉన్నట్టు చూపింది. ఇంత పెద్ద వ్యవస్థలో రెండు బస్తాలు తగ్గిపోవటం పెద్ద నేరమా అని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. సీఎమ్మార్ తమకు ఎంత ధాన్యం కేటాయించారో గడువులోగా అంత ఇస్తామని, లేకుంటే చర్యలు తీసుకోవచ్చని మిల్లర్లు చెప్తున్నారు. ముందస్తు తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు.
కచ్చితంగా కక్షసాధింపే
సీఎమ్మార్ తీసుకోవాలంటూ ఎఫ్సీఐతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చర్చించినప్పటికీ స్పందనలేదు. రాష్ట్ర అధికారులు మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఎఫ్సీఐ నిర్ణయంపై రాష్ట్ర సివిల్ సైప్లె అధికారులు, రైస్ మిల్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం బస్తాల్లో తేడా ఉంటే చర్యలు తీసుకోవాలే తప్ప, సీఎమ్మార్ నిలిపివేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది కక్షసాధింపేనని ఆరోపిస్తున్నారు. సీఎమ్మార్ తీసుకోకపోవడంతో రాష్ట్రంలోని రైస్ మిల్లులన్నీ మూతపడ్డాయి.
పనులు లేకపోవడంతో సుమారు లక్ష మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక్కడ పనులు ఆగిపోవడంతో ఇతర రాష్ర్టాలకు చెందిన హమాలీలు తిరిగి సొంత రాష్ర్టానికి వెళ్లిపోతున్నారు. ఎఫ్సీఐ ఇబ్బందులు, మిల్లుల నిర్వహణ ఖర్చు, హమాలీలు వెళ్లిపోతుండడంతో రైస్ మిల్లర్లు ఏంచేయాలో తెలియక సతమతమవుతున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే మిల్లులు నడపడం కష్టమని, ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. కక్షసాధింపు చర్యలు ఆపకుంటే ఎఫ్సీఐ రీజినల్ కార్యాలయం ఎదుట ధర్నాకు మిల్లర్లు సిద్ధమవుతున్నారు.
ఇటు కొర్రీలు.. అటు నిందలు
రాష్ట్రంపై కక్షసాధింపులో ఎఫ్సీఐ డబుల్గేమ్ ఆడుతున్నది. ఓవైపు సీఎమ్మార్ తీసుకోవడంలో కొర్రీలు పెడుతూనే మరోవైపు గడువులోపు సీఎమ్మార్ ఇవ్వడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నది. ఈ మధ్యకాలంలోనే ఏకంగా ఐదారుసార్లు సీఎమ్మార్ను నిలిపివేయడం గమనార్హం. ఓసారి తనిఖీల పేరుతో, మరోసారి ధాన్యం సంచులు సరైన పద్ధతిలో లేవంటూ, ఇంకోసారి బాయిల్డ్ రైస్ పేరుతో, ఫోర్టిఫైడ్ రైస్ పేరుతో ఇలా ఏదో ఒక పసలేని వంకలతో సీఎమ్మార్ నిలిపివేస్తున్నది. సీఎమ్మార్ను పాత గన్నీ సంచుల్లో ఇచ్చేందుకు అనుమతిచ్చిన ఎఫ్సీఐ.. తర్వాత తీసుకొనేందుకు నాలుగురోజులపాటు నిరాకరించింది. సీఎమ్మార్ గడువును కేంద్రం పొడిగించినా.. ఆదేశాలు అందలేంటూ సీఎమ్మార్ను నిలిపేసింది. చిన్నచిన్న కారణాలతో సీఎమ్మార్ను నిలిపేస్తూ మిల్లర్లను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. సీఎమ్మార్ సకాలంలో ఇవ్వలేదంటూ రాష్ర్టాన్ని బద్నాం చేస్తున్నది.
నూకశాతంపై రాష్ర్టానికి శాస్త్రవేత్తల బృందం
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో యాసంగి ధాన్యం మిల్లింగ్లో నూకశాతంపై పరిశోధన చేస్తున్న మైసూర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎఫ్టీఆర్ఐ)కు చెందిన శాస్త్రవేత్తల బృందం గురువారం రాష్ర్టానికి రానున్నది. రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో ధాన్యాన్ని టెస్ట్ మిల్లింగ్ చేయనున్నది. ఇప్పటికే ఈ బృందం గత నెల 26న రాష్ర్టానికి వచ్చి ధాన్యం శాంపిల్స్ సేకరించి నూకశాతంపై సీఎఫ్టీఆర్ఐలో పరిశోధన చేసింది. ఇప్పుడు రాష్ట్రంలోని మిల్లుల్లో టెస్ట్ మిల్లింగ్ ద్వారా నూకశాతం ఎంత వస్తుందో లెక్కతేల్చి పోల్చనున్నది. దీనిపై వచ్చేవారం నివేదిక వచ్చే అవకాశం ఉన్నది. దీని ఆధారంగా ప్రభుత్వం అదనంగా ఎంత నష్టం భరించాలనేది తేలిపోనున్నది.
సీఎమ్మార్ నిలిపివేతతో కలిగే నష్టాలు