హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందని భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ ఎల్ల కృష్ణ స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. నగరంలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ సమావేశంలో డాక్టర్ కృష్ణ ఎల్ల పాల్గొని ప్రసంగించారు.
భారత్ బయోటెక్.. పలు వ్యాధులకు వ్యాక్సిన్లు తెచ్చిందని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి తెలంగాణలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. ఇతరుల కంటే ముందుగా వ్యాక్సిన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనేక దేశాలకు సరైన సమయంలో కరోనా వ్యాక్సిన్లు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ మెడికల్ హబ్గా మారిందన్నారు. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు కావాల్సిన దాన్ని గ్రహించి వెంటనే మార్కెట్లోకి తేవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు సహకరిస్తున్నాయి. ప్రపంచం మొత్తానికి ఆహారం అందించే శక్తి భారత్కు ఉందన్నారు. మన వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి అని కృష్ణ ఎల్ల సూచించారు.