హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మహిళాభ్యున్నతిలో తెలంగాణ దేశానికి ఆదర్శమని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. గురువారం హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)లో నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్(ఐఏఎస్ఎస్ఐ) 22వ వార్షిక సదస్సులో రామకృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సంఘాల పనితీరు ఆదర్శంగా ఉన్నదని ప్రశంసించారు. పదేండ్లలో స్వయం సహాయక సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ రేవతి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ సెక్రటరీ ధనంజయ్ సింగ్, ప్రొఫెసర్లు ఎస్ మహేంద్రదేవ్, సచిన్ చతుర్వేది, దీపక్ నయ్యర్ తదితరులు పాల్గొన్నారు.