హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారికి 5 శాతం రిజర్వేషన్లు, కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధి పథకాల వల్ల 2018, 19 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణను అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి, అవార్డులు ఇచ్చిందన్నారు. వీటితోపాటు భవిష్యత్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు, చేతికర్రలు, త్రీవీలర్ స్కూటీలను ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. వీటితో పాటు కృత్రిమ కాళ్లు, చేతులు తయారుచేసే యూనిట్తో హైదరాబాద్లో అతిపెద్ద పార్క్ను ఏర్పాటు చేసుకుంటున్నామని వెల్లడించారు.