హైదరాబాద్: ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా వేల ఆశా వర్కర్లు అందించిన సేవలకుగాను అందిస్తున్న ఇన్సెంటివ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నెలవారీ ప్రోత్సాహకాలను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ.7500 నుంచి రూ.9750కి పెరగనున్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. పెంచిన ఇన్సెంటివ్లు గతేడాది జూన్ నుంచి వర్తిస్తాయని పేర్కొన్నది.