హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా మండలి నియమించింది.
టీఎస్ ఎంసెట్, టీఎస్ ఈసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూహెచ్కు, టీఎస్ ఐసెట్ను కాకతీయ యూనివర్సిటీకి, టీఎస్ పీజీఈసెట్, టీఎస్ ఎడ్సెట్, టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు.
టీఎస్ ఎంసెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ (జేఎన్టీయూహెచ్)
టీఎస్ ఈసెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ కే విజయ్ కుమార్ రెడ్డి (జేఎన్టీయూహెచ్)
టీఎస్ ఐసెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ కే రాజిరెడ్డి (కాకతీయ యూనివర్సిటీ)
టీఎస్ పీజీ ఈసెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ (ఓయూ రిజిస్ట్రార్)
టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ( ఓయూ )
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్సెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ జీబీ రెడ్డి (పీజీఆర్ఆర్ డైరెక్టర్)