హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీ సుమలత, జస్టిస్ ఎం సుధీర్ కుమార్ బదిలీ అయ్యారు. జస్టిస్ సుధీర్కుమార్ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు 10న వీరి బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, ఇందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోదం తెలిపారు. వీరితోపాటు వివిధ హైకోర్టులకు చెందిన మరో ముగ్గురిని కూడా బదిలీ చేశారు.