హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): దర్శకుడు రాంగోపాల్వర్మ రూపొందించిన వివాదాస్పద చి త్రం ‘వ్యూహం’ విడుదలకు బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్సీ) ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను హైకోర్టు రద్దు చేసింది. బోర్డు రివైజింగ్ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వా త జస్టిస్ సూరేపల్లి నంద సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరోసారి చూసి మూడు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని కమిటీని ఆదేశించారు. దీంతో ఈ తీర్పుపై ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించేందుకు ‘వ్యూహం’ చిత్ర నిర్మాత సిద్ధమవుతున్నారు.