హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కొత్త ఓటర్ల నమోదును ఆమోదించొద్దంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కొత్త ఓటర్లు నమోదు అసాధారణంగా పెరగలేదని, బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పరిషారమైనట్టు ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాసర్రెడ్డిల ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది.
రిట్ను మరోసారి విచారించి ఏ విధమైన ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ముందు కొత్త ఓటర్ల నమోదు జరుగుతూనే ఉంటుందని, 7 వేల కొత్త దరఖాస్తులు తిరసరించామని, మరో 5 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అవినాశ్ దేశాయ్ చెప్పారు.