Rain alert | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రోహిణి కార్తె కావడంతో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నప్పటికీ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని, దీంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లు కురిసే అవకాశం ఉండగా, ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. సోమవారం ఉదయం 7 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది.