హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఇంధన పొదుపులో తెలంగాణ మరోసారి మేటిగా నిరూపించుకున్నది. తెలంగాణ పునరుత్పాధక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడో)కు జాతీయ పురస్కారం దక్కింది. 32వ జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్కుమార్ సింగ్ చేతుల మీదుగా ‘సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్’ను రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, ఎండీ జానయ్య స్వీకరించారు.
ఈ సందర్భంగా సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. ఇంధన పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేలా భవన నిర్మాణ దశ నుంచే చర్యలు తీసుకుంటున్నామని, పరిశ్రమల్లోనూ కరెంటు ఆదా అయ్యేలా యంత్రాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రెడ్కోకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, విద్యుత్తుశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెడో ఉద్యోగులను ఆయన అభినందించారు.