హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మరో రూ.900 కోట్లు అప్పు చేసింది. బాండ్ల విక్రయాల ద్వారా రాష్ర్టానికి రూ.900 కోట్లు కావాలని గత శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరగా, మంగళవారం మంజూరుకు అనుమతిచ్చింది. 18 ఏండ్ల కాల పరిమితితో ఆ రుణాన్ని పొందింది. దేశంలోని 13 రాష్ర్టాలకు మొత్తం రూ.19,592 కోట్ల రుణాలిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇందులో ఉత్తరప్రదేశ్కు అత్యధికంగా రూ.4,000 కోట్లు, అత్యల్పంగా అరుణాచల్ప్రదేశ్కు రూ.170 కోట్ల రుణం మంజూరు చేసింది.