హైదరాబాద్ : నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ప్రవాహ సామర్థ్యాలలో అసమతుల్యతను సవరించాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఛైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ సీ మురళిధర్ బుధవారం లేఖ రాశారు.
-1952 లో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్ కుడి కాలువ(ఆంధ్ర ప్రదెశ్ వైపు), ఎడమ కాలువ(తెలంగాణ వైపు) హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలి.
-నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జునసాగర్ నీటి మట్టం +500 అడుగుల వద్ద 11,000 క్యూసెక్కులు ఉంటే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జునసాగర్లో నీటి మట్టం +520 అడుగుల ఉంటేనే 11,000 క్యూసెక్కులు వీలవుతుంది.
-ఎండీడీఎల్ (MDDL) 510 అడుగుల వద్ద ఎడమ కాలువ విడుదల సామర్థ్యం 7,899 క్యూసెక్కులు ఉండగా, కుడి కాలువ విడుదల సామర్థ్యం 24,606 క్యూసెక్కులుగా ఉంది. ఇది రెండు కాలువల్లో ఉన్న తీవ్రమైన అసమానత.
-నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాల్లో ఈ అసమానతను సరిదిద్దాలి. ఎండీడీఎల్ +510 అడుగుల వద్ద రెండు కాలువల విడుదల సామర్థ్యం సమానంగా ఉండాలి.
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఇతర మార్గాల ద్వారా సాగు నీటి సరఫరాకు అవకాశం ఉన్నందున వారు కృష్ణా నది నీటిని బేసిన్లో ఉన్న తెలంగాణకు వదిలేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ను కోరింది.