హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): పిల్లలను దత్తత తీసుకోవాలనుకొనే తల్లిదండ్రుల కోసం త్వరలో హెల్ప్లైన్ను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ వెల్లడించారు. నవంబర్ను అంతర్జాతీయ దత్తత మా సంగా పాటిస్తున్న నేపథ్యంలో చట్టబద్ధ దత్తతను ప్రోత్సహించడంపై శుక్రవారం హైదరాబాద్లోని మహిళా కమిషనరేట్ ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాలున్న ఇద్దరు చిన్నారులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ దత్తత తీసుకోవడం స్ఫూర్తిదాయకమని దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు. ఆడపిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను అభినందించారు. రాష్ట్రంలో చట్టబద్ధ దత్తతను ప్రోత్సహించేందుకు ‘వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్’ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తున్నదని ప్రశంసించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జే శ్రీనివాస్రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ రీజనల్ జేడీ శారద, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజా రమణ, సభ్యులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల సీడబ్ల్యూసీ చైర్పర్సన్లు పాల్గొన్నారు. అనంతరం చట్టబద్ధ దత్తతపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు.