కరీంనగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ మూడోవారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం చేతిలో ఉన్న ఎఫ్సీఐ ధా న్యం కొనుగోళ్లకు సహకరించడం లేదన్నారు.
ఆ సంస్థతో సంబంధం లేకుండానే యాసంగిలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,060 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పారు.