Padma Awards | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): తాజా గా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్ర భుత్వం ఆదివారం సతరించనున్నది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్రెడ్డి అవార్డు గ్రహీతలను సతరిస్తారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎనిమిది మందికి పద్మ అవార్డులు వరించాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి వేళు ఆనందాచారి, బుర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు కేతావత్ సోమాలాల్, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురసారాలను ప్రకటించింది.