హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.612.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,850 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పటికే రెండు త్రైమాసికాలకు రూ.925 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడో త్రైమాసికానికి రూ.462.50 కోట్లు విడుదల చేసింది. షాదీముబారక్ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేసి.. తాజాగా మిగిలిన రూ.150 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.