హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): మూసీ నది పునరుజ్జీవ ప నులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ క్యాబినెట్ సబ్కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార తెలిపారు. మూసీ పునరుజ్జీ వ పనుల పురోగతిపై మంగళవారం ఆయన సచివాలయంలో రవాణా శాఖ మంత్రి, మూసీ క్యాబినెట్ సబ్కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్తో కలిసి అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవ పనులపై మెయిల్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామ ని, ఏప్రిల్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజల నుం చి వచ్చిన సలహాలు, సూచనలను అధికారులతో కలి సి విశ్లేషిస్తామ ని, అనంత రం విలువైన అభిప్రాయా లు వెల్లడించినవారితో సబ్కమిటీ సభ్యులు నేరుగా సంప్రదింపులు జరుపుతారని వివరించారు.
మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2లో చేయాల్సిన పనులకు రోడ్మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు సలహాలు, సూచన లు ఇచ్చేందుకు మూసీ సబ్కమిటీ స భ్యులు నిరంతరం అందుబాటులో ఉం టారని తెలిపారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి,జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పాల్గొన్నారు.