హైదరాబాద్, మార్చి29 (నమస్తే తెలంగాణ): ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనానికి సంబంధించి రూ.9.99 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఒక్కో ఇమామ్కు రూ.9,997, మౌజన్కు రూ.5 వేల చొ ప్పున గౌరవవేతనం చెల్లిస్తున్నది. నిధుల విడుదలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసివుల్లాఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇమామ్, మౌజన్ల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.