యాదాద్రి, భువనగిరి : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ( Governor Shiva Pratap Shukla ) కుటుంబ సభ్యులు గురువారం యాదాద్రి ( Yadadri ) లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆలయానికి చేరుకున్న గవర్నర్కు ఆలయ మర్యాద ప్రకారం పూర్ణకుంబంతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,ఈవో భవాని శంకర్, తదితరులు పాల్గొన్నారు.