Assembly | హైదరాబాద్ : రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉభయలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సమావేశమై గవర్నర్ ప్రసంగంపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. గవర్నర్ అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.