హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాలపాటు అలుపెరుగని పోరాటం, అమరుల త్యాగఫలంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
తెలంగాణ ఐటీ, ఫార్మా, లైఫ్సైన్సెస్, వ్యవసాయ రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తున్నదని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం రాజ్భవన్లో ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.