Job Notification | తెలంగాణలో మరో 1540 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లోని ఏఈఈ పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 14 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్పీ ప్రకటించింది.