హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మరో 28 మంది ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు వైవీ గణేశ్, బేతి రాజేశం, ఎస్ మోతీలాల్ను రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.