హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఏపీ రాష్ట్రం గోదావరి నదీజలాల పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభు త్వం వద్దే తేల్చుకోవాలని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. శుక్రవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా గోదావరి నదీజలాల పంపిణీ కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ వేయాలని ఏపీ కోరగా.. తెలంగాణ అధికారు లు అభ్యంతరం తెలిపారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం ఏపీ ఈ అంశాన్ని కేంద్రం వద్దే తేల్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జీఆర్ఎంబీకి విభజన చట్టం ప్రకారం వచ్చిన అధికారాలకే పరిమితం కావాలని తేల్చి చెప్పారు. ఈ అంశాన్ని పక్కనపెడుతున్నట్టు బోర్డు చైర్మన్ ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల్లో టెలిమెట్రి కేంద్రాలు పెట్టాలనే ప్రతిపాదనలను వ్యతిరేకించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులోనే టెలిమెట్రిలు పెట్టాలని సూ చించారు. వీటిని జాతీ య హైడ్రాలజీ కింద ఏర్పాటుచేయాలని కోరారు. ఇందిర మ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, ఎస్సారెస్పీ-2 విస్తరణ, ఎల్లంపల్లిపై శ్రీపాద ఎత్తిపోతల, కాళేశ్వరం అదనపు టీఎంసీ, కుప్టి పథకాలపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయ గా.. గోదావరిలో న్యాయమైన వాటా ప్రకారమే వీటిని చేపట్టామని వివరించారు.