హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 40 మంది డీఎస్పీలకు పలుచోట్ల పోస్టింగులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరికొందరిని బదిలీ చేస్తూ హోంశాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది.
ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. మల్టీజోన్-2లో పరిధిలోని 26 మంది ఎస్సై (సివిల్)లకు ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీజోన్-2 షానవాజ్ ఖాసీం ఉత్తర్వులు జారీ చేశారు.