హైదరాబాద్, జనవరి12 (నమస్తే తెలంగాణ): కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి జయంతిని 16న ప్రభుత్వపరంగా నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించంది. ఈ మేరకు అధికారులకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జయంతితోపాటు జూలై 28న ఆయన వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.