హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం (నేటి వరకు) కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ నేటితో ముగియనుండటంతో ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం యోచించింది. యథాతథంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.