హైదరాబాద్ : రూ.50వేలలోపు పంట రుణం తీసుకున్న రైతులకు ఈ నెల 16 నుంచి రుణమాఫీ కానుంది. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం లబ్ధిదారులకు రుణమాఫీ నిధులు పంపిణీ చేయనుంది. 25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు రైతుబంధు తరహాలో ఖాతాల్లో సర్కారు నేరుగా నిధులు జమ చేయనుంది. తక్కువ మొత్తం ఉన్న వారి నుంచి ప్రారంభించి రూ. 50 వేల వరకు ప్రాధాన్య క్రమంలో నిధులు జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6, 61,811 మందికి రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. రూ. 50 వేల లోపు రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం 2005.85 కోట్లు కేటాయించింది.