School Holidays | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. బుధ, గురువారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. గతవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాపాతం నమోదవుతున్నది. గత గురువారం నుంచి శనివారం వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.