Women’s Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 19 మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. తానిపర్తి చికిత (ఆటలు), కుడుముల లోకేశ్వరి (ఆటలు), ముక్తేవి భారతి (సాహితి), దివనపల్లి వీణావాణి, ఎస్ జబీన్ (లిటరేచర్-ఉర్దు), బండ సరోజన (ఎడ్యూకేషన్-కరికులం), బిన కేశవరావు (హ్యాండి క్రాఫ్ట్), గుర్రాల సరోజ (సోషల్ సర్వీస్), జమీల నిషత్ (సోషల్ సర్వీస్), అరిపిన జయలక్ష్మి (స్పెషల్ కేటగిరి), దయ్యాల భాగ్య (డాన్స్-ఫిజికల్ ఛాలెంజ్), ప్రొఫెసర్ అరుణ భిక్షు (కూచిపుడి నృత్యం) అవార్డులకు ఎంపిక చేసింది. అలాగే, సునీల ప్రకాశ్ (పేరిణి నృత్యం), బండి రాములమ్మ (బోనాల కోలాటం), గొరిగె నీల (బోనాల కోలాటం), మట్టది సరవ్వ (డప్పు కళాకారిణి), సీహెచ్ పుష్ప (ఏకచక్రపురం రైతు), లుఖ్మా కమ్యూనిటీ (సఫా ఎన్జీవో), శక్తి టీమ్ (దక్షిణ మధ్య రైల్వే వుమెన్ ఆర్పీఎఫ్)కు అవార్డులను ఎంపిక చేసింది.