Telangana | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు( Iftar Party ) నిర్వహించాలని సీఎం కేసీఆర్( CM KCR ) నిర్ణయించారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియం( LB Stadium )లో ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.