హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన విద్యార్థి గడ్డం ధనలక్ష్మి దుబాయ్లో నిర్వహించిన డీపీ వరల్డ్ బిగ్ టెక్ ప్రాజెక్ట్ మొదటి ఎడిషన్ విజేతగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు, టెర్మినల్స్లో ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచే వర్చువల్ సొల్యూషన్ను రూపొందించినందుకుగాను ధనలక్ష్మిని విజేతగా ప్రకటించారు.
హైదరాబాద్కు చెందిన ధనలక్ష్మి యూఏఈ అబూదాబీలోని మహ్మద్ బిన్ జాయెద్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నది.సహచరులు అబ్బాస్ బమిడెల్తో కలిసి వర్చువల్ సొల్యూషన్ను రూపొందించి విజేతగా నిలిచింది. ఆమెకు రూ.5 వేల డాలర్ల బహుమతి లభించింది.