హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాయుధ పోరాట యోధులకు స్వరాష్ట్రంలోనే తగిన గుర్తింపు లభిస్తున్నదని తెలంగాణ రజక సంఘాల సమితి (టీఆర్ఎస్ఎస్) హర్షం వ్యక్తం చేసింది. వీరనారి చాకలి ఐలమ్మ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం, ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ మేరకు టీఆర్ఎస్ఎస్ ముఖ్య సలహాదారు, ఎంబీఎస్ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26న ఐలమ్మ, 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంత్యుత్సవాలకు భారీగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.